క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న దయాకర్ రెడ్డి

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న దయాకర్ రెడ్డి

WhatsApp Image 2024-12-25 at 7.36.53 PM

ఖమ్మం బ్యూరో,తెలంగాణ ముచ్చట్లు: పాలేరు నియోజకవర్గంలో బుధవారం జరిగిన క్రిస్మస్ వేడుకల్లో తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఖమ్మం రూరల్ మండలంలో నాలుగో తరగతి ఉద్యోగుల కాలనీ, ఎదులాపురం, గుదిమళ్ళ, కొండాపురం గ్రామాల్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో, తిరుమలాయపాలెం మండలం ఏలువారిగూడెంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. చర్చి ఫాస్టర్ లు దయాకర్ రెడ్డిని ఆశీర్వదించారు. అనంతరం ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్డులో వావ్ ఎలక్ట్రికల్ స్కూటీ షోరూంను ప్రారంభించారు. అదేవిధంగా తిరుమలాయపాలెం మండలం బచ్చోడులో రామసహాయం అరవింద్ రెడ్డి తల్లి సంవత్సరీక కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .