ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో దయాకర్ రెడ్డి పర్యటన
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో బుధవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా ఖమ్మం నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీహర్ష ఫైనాన్స్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అదేవిధంగా మమతా రోడ్ లోని కాకతీయ పాఠశాలలో జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఖమ్మం రూరల్ మండలం కరుణగిరి లో జరిగిన ఆధారపు రమేష్ కుమారుని వివాహానికి, గోళ్ళపాడు గ్రామంలో జరిగిన గార్ల లక్ష్మయ్య కుమారుని వివాహానికి హాజరయ్యారు. కూసుమంచి మండలంలో జరిగిన కాంపాటి కోటయ్య కుమారుని వివాహ నిశ్చితార్థానికి, పోలంపల్లి ఉప్పలయ్య కుమారుని వివాహానికి హాజరయ్యారు. చేగొమ్మలో కొండపర్తి సురేష్ పెదనాన్న దశదిన కర్మలో పాల్గొన్నారు.


Comments