దళిత వాడపై వివక్ష.. బోనాల పండుగ పూట కూడా చీకట్లే!
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో దళిత వాడ ప్రజలు వివక్షకు గురవుతున్నారు. బోనాల పండుగ సందర్భంగా గ్రామమంతా వెలుగులా మెరిసిపోతుంటే, దళిత వాడ మాత్రం చీకట్లలో మగ్గిపోతోంది. కారణం – పంచాయితీ కార్యదర్శి నిర్లక్ష్యం, వివక్షత.
బీసీ వాడలోని ప్రతి వీధి దీపం వెలిగేలా చూసిన పంచాయితీ సిబ్బంది, అదనంగా ఫోకస్ లైట్లూ ఏర్పాటు చేశారు. కానీ దళిత వాడలో మాత్రం ఒక్క వీధి దీపం కూడా వెలగకుండా వదిలేశారు. పండుగ రోజునా ఇలాంటి వివక్ష తలెత్తడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలో అందరికీ సమాన హక్కులు ఉన్నా, కేవలం దళిత వాడకే మౌలిక సదుపాయాలను నిరాకరించడం ఘోర అన్యాయం. కనీసం వీధి దీపాలు కూడా వెలిగించకుండా నిర్లక్ష్యం వహించిన పంచాయితీ కార్యదర్శిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

“ఒక వాడ వెలుగులో మునిగిపోతుంటే, మరొక వాడ చీకట్లో మగ్గిపోవడం ఏ విధమైన పాలన?” అని గ్రామస్థులు మండిపడుతున్నారు.


Comments