వనపర్తి సంస్థాన వారసుడిని కలిసిన జిల్లా ఎస్పీ
వనపర్తి,సెప్టెంబర్25(తెలంగాణ ముచ్చట్లు):
గురువారం వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్, వనపర్తి సంస్థాన వారసుడు శ్రీ రాజా కృష్ణదేవరావు ను నాగవరం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పూల మొక్కను అందజేశారు.
సంస్థాన విశేషాలను తెలియజేసిన రాజా కృష్ణదేవరావు, 450 సంవత్సరాల పాటు సాగిన వనపర్తి సంస్థాన చరిత్ర, పాలనా కాలంలో ప్రజలకు అందించిన వ్యవసాయ, వాణిజ్య, తాగునీటి సౌకర్యాలు, సాహిత్య, సాంస్కృతిక, సాంకేతిక పరిజ్ఞానం తదితర వివరాలను ఎస్పీతో పంచుకున్నారు. అదనంగా, “సూగూరు సిక్క్” పేరున వనపర్తి సంస్థానానికి ప్రత్యేక కరెన్సీ ఏర్పాటు చేసి నిజాం రాష్ట్రంలో చెల్లుబాటు అయ్యేలా అనుమతులు ఉండేవని వివరించారు.
ఈ సమావేశంలో వనపర్తి పట్టణ మరియు జిల్లాలోని శాంతి భద్రతల పరిస్థితులను రాజా కృష్ణదేవరావు ఎస్పీని అడిగి తెలుసుకున్నారు. ఏదైనా అవసరమైన సందర్భంలో తమవంతు సహకారం అందిస్తామని రాజా కృష్ణదేవరావు ఎస్పీకి తెలిపారు.
ఈ కార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కిరణ్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు, వనపర్తి పట్టణ ఎస్సై హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


Comments