ఏఐపిసి రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ జిల్లెల్ల ఆదిత్య రెడ్డి నియామకం

మర్యాదపూర్వకంగా కలిసిన వికలాంగుల సంఘం అధ్యక్షులు గంజాయి రమేష్

ఏఐపిసి రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ జిల్లెల్ల ఆదిత్య రెడ్డి నియామకం

వనపర్తి,అక్టోబర్29(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా యువ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ జిల్లెల్ల ఆదిత్య రెడ్డి ని ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (ఏఐపిసి) రాష్ట్ర అధ్యక్షుడిగా అధిష్టానం నియమించింది.

కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రధాన అతిథిగా హాజరై, కార్యకర్తలకు ప్రోత్సాహం అందిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న డాక్టర్ ఆదిత్య రెడ్డి గతంలో ఏఐటిసి హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ నేషనల్ హెడ్ గా సేవలందించారు. వనపర్తి నియోజకవర్గంలో యువ నాయకుడిగా ప్రజల్లో విశ్వాసం సంపాదించిన ఆయనకు పార్టీ అధిష్టానం రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పగించడం పట్ల జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా వనపర్తి జిల్లా వికలాంగుల కమిటీ అధ్యక్షులు గంజాయి రమేష్ డాక్టర్ జిల్లెల్ల ఆదిత్య రెడ్డిని మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో సన్మానించారు. అధ్యక్షులు మాట్లాడుతూ.. ఆదిత్య రెడ్డి పార్టీ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తున్నారని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఎం. దేవన్న యాదవ్, మున్నూరు జయకర్, పి. యాదగిరి, అజీమ్ తదితరులు పాల్గొని డాక్టర్ ఆదిత్య రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .