డాక్టర్ పులిపాటి ప్రసాద్కు జీ టీవీ అచీవ్మెంట్ –2025 అవార్డు
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 24, తెలంగాణ ముచ్చట్లు;
ఖమ్మం పౌరసమితి మహాత్మా గాంధీ ఫౌండేషన్ ల చైర్మన్ న్యాయవాది ప్రముఖ విద్యావేత్త డాక్టర్ పులిపాటి ప్రసాద్ ప్రతిష్టాత్మక జీ టీవీ అచీవ్మెంట్ అవార్డు–2025 ను ఘనంగా అందుకోనున్నారు. ఈ కార్యక్రమం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో జరగనున్నది. పద్మ విభూషణ్ నాగేశ్వర్ రెడ్డి పద్మశ్రీ మందా కృష్ణ పలు నంది అవార్డుల గ్రహీత తనికెళ్ల భరణి వంటి ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొన బోతున్నారు.ఈ సందర్భంగా డా. పులిపాటి ప్రసాద్ సేవా కృషిని ప్రశంసిస్తూ పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.అభినందనలు తెలిపిన వారిలో కడవెండి శ్రీనివాస్ కొత్త వెంకటేశ్వర రావు గోళ్ళ రాధాకృష్ణ షేక్ ఖాసిం సతీష్ చౌదరి గుమ్మడివెల్లి శ్రీనివాస్ వరప్రసాద్ మృత్యుంజయ గుప్తా వజీనేపల్లి శ్రీనివాస్ సిద్ధంశెట్టి శ్రీకాంత్ పద్మజా రెడ్డి శ్రీకళా రెడ్డి రాజారెడ్డి రాజేష్ ప్రతాప్ నీరజ రామకృష్ణ కొదుమూరి జగన్నాథం కొదుమూరి భద్రయ్య వెల్లంపల్లి వెంకట సుబ్బారావు రాజారావు కొల్లూరు కృష్ణమూర్తి బూర్లె లక్ష్మీనారాయణ బూర్లె వెంకటేశ్వర్లు పాల్వంచ రామారావు కొత్తూరు రమేష్ తదితరులు వున్నారు.


Comments