12 ఏళ్ల నివాస సమస్యకు ముగింపు
చిన్నారెడ్డి చోరవలో గుంటి బాలక్రిష్ణకు పట్టా!
Views: 26
On
వనపర్తి,సెప్టెంబర్24(తెలంగాణ ముచ్చట్లు):
శ్రీరంగాపూర్ మండలం నాగరాల గ్రామానికి చెందిన గుంటి బాలక్రిష్ణ 12 ఏళ్లుగా నివాస స్థల పట్టా కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగారు. గ్రామ నాయకులు సహకరించకపోవడం, అధికారుల దాఖలాలు లేవడం వల్ల సమస్య పరిష్కారం కావడంలేదు.
ఆఖరి ప్రయత్నంగా ప్రజావాణి కార్యక్రమంలో తన సమస్యను వెల్లడి చేసిన వెంటనే, ప్రజావాణి ఇంచార్జ్ మరియు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ప్రత్యేక చోరవతో నివాస స్థల పట్టాను అందజేశారు.
తన సమస్య పరిష్కారం అయిన సందర్భంగా గుంటి బాలక్రిష్ణ డాక్టర్ చిన్నారెడ్డిని శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్ పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments