ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుతే ఉత్తమ ఫలితాలు.
కాళోజి జూనియర్ కళాశాల చైర్మన్ ఎస్.శ్యాంసుందర్ రెడ్డి.
హాసన్ పర్తి,తెలంగాణ ముచ్చట్లు:
ప్రతి విద్యార్థి కష్టపడి క్రమశిక్షణతో సమయ పాలన పాటించి చదువుకున్నట్లయితే ఉత్తమ ఫలితాలు సాధిస్తారని కాళోజి జూనియర్ కళాశాల చైర్మన్ ఎస్ శ్యాంసుందర్ రెడ్డి అన్నారు. సోమవారం గ్రేటర్ వరంగల్ 55వ డివిజన్ పరిధి భీమారంలోని జగతి గార్డెన్ లో కాళోజీ జూనియర్ కళాశాల 11వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల చైర్మన్ ఎస్ శ్యాంసుందర్ రెడ్డి, ప్రిన్సిపాల్, వైకెఎస్, డైరెక్టర్లు, సరస్వతి దేవి చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ మాట్లాడుతూ కాళోజి జూనియర్ కళాశాల స్థాపించి 11 సంవత్సరాల కాలంలో ఐదువేల మంది విద్యార్థులను వివిధ శాఖలలో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారని గుర్తు చేశారు. మా కళాశాలలో చదువే విద్యార్థులందరూ అభివృద్ధి చెందాలని లక్ష్యంతో విద్యార్థులకు బోధన అందిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకొని కష్టపడి చదువుతే ఉత్తమ ఫలితాలు సాధిస్తారన్నారు.అనంతరం ప్రిన్సిపాల్. వై కే ఎస్, మాట్లాడుతూ విద్యార్థులలో సృజనాత్మకతను నైతిక విలువలను పెంపొందించుకోవాలని అన్నారు. అనంతరం విద్యార్థులు సంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు కే తిరుపతిరెడ్డి, ఇ.అనిల్ రెడ్డి, టి.మధుకర్ రెడ్డి, ఎం సంతోష్ కుమార్, విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


Comments