ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటుపడాలి

ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటుపడాలి

 జఫర్గడ్,తెలంగాణ ముచ్చట్లు: ధర్మపరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆ దిశగా అందరూ చేయి చేయి  కలిపినప్పుడే సాధ్యం ధర్మ పరిరక్షణ అవుతుందని ధర్మ జాగరణ జిల్లా సంయోజక్ సత్యనారాయణ వివరించారు.
సనాతన ధర్మ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా  నిర్వహిస్తున్న హిందూ చైతన్య రథయాత్ర గురువారం సాయంత్రం మండల కేంద్రంలోని  రామాలయంకు చేరుకుంది.
ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు.
అనంతరం సత్యనారాయణ మాట్లాడుచూ.. సనాతన ధర్మ పరిరక్షణలో ప్రతి వ్యక్తి నడుంకట్టినప్పుడే దేశంలో శాంతి-సౌభాగ్యం వెల్లివిరుస్తుందన్నారు. గతంలో ధర్మం నాలుగు పాదాల మీద నడించిందని పుస్తకంలో మనందరం చదువుకున్నామని, అలాంటి ధర్మం మళ్లీ నేటి సమాజంలో రావాలన్నారు.పురవీధుల గుండా నిర్వహించిన ఈ రథయాత్రకు విశేషమైన ఆదరణ లభించింది.ఈ కార్యక్రమంలో అంచూరి కమల,దాంశెట్టి శ్రావ్య, గందె సోమన్న,బోనగిరి శ్రవణ్ కుమార్ ,బెలిదె హరిశంకర్ , బజ్జూరి నాగమ్మ,అంచూరి ధనలక్ష్మీ,ఇమ్మడి భద్రయ్య, పాలకుర్తి సరోజన ,గందె సమత, ఇమ్మడి మాధవి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .