మనిగిల్లలో ప్రజా సమస్యలపై దృష్టి
మార్నింగ్ వాక్ లో సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్
పెద్దమందడి,డిసెంబర్28(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం మనిగిల్ల గ్రామంలో నూతన సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ మరియు ఉపసర్పంచ్ గణేష్ ఆధ్వర్యంలో మార్నింగ్ వాక్ కార్యక్రమం నిర్వహించి, ఎనిమిదో వార్డును సందర్శించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలతో ముఖాముఖి సమావేశం నిర్వహించి, వారి సమస్యలను తెలుసుకున్నారు.గ్రామ అభివృద్ధికి ప్రజల సూచనలు ఎంతో కీలకమని సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ పేర్కొంటూ, సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇచ్చారు.ప్రజలతో నేరుగా సంప్రదింపులు కొనసాగిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మనిగిల్ల గ్రామ బీఆర్ఎస్ నాయకులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యంగా 2వ వార్డు నెంబర్ శ్రీకాంత్ రెడ్డి, బోయిన కృష్ణయ్య, బీకే ప్రేమ్ కుమార్ రెడ్డి, బోడి గణేష్, కావలి శివ శంకర్, మండల తిరుపతయ్య, ఎం. రవికుమార్, మందడి సాయి కుమార్, ఉప్పరి శివకృష్ణ, మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


Comments