బోదులబండలో ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం..
వైరా కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత శిబిరం..
ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 7, తెలంగాణ ముచ్చట్లు;
నేలకొండపల్లి భక్తరామదాసు సర్వీస్ సొసైటీ, లయన్స్ ఐ హాస్పిటల్, వైరా ఆధ్వర్యంలో మంగళవారం నేలకొండపల్లి మండలం బోదులబండ గ్రామంలో ఉచిత కంటి వైద్య శిభిరం విజయవంతంగా నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిభిరంలో సుమారు 250మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 50మందికి కంటి అపరషన్స్ గుర్తించారు. భక్తరామదాసు సర్వీస్ సొసైటీ వారు ఈ సందర్బంగా మాట్లాడుతూ పేద ప్రజలకు లయన్స్ కంటి ఆసుపత్రి చేస్తున్న సేవలను అభినందించారు. లయన్ డాక్టర్ కాపా మురళీకృష్ణ ఐ హాస్పిటల్ చైర్మన్, ఐ హాస్పిటల్ నిర్వాహకులు లయన్ శ్యాంబాబు ఉండ్రు, డాక్టర్ రవిచంద, కంటి ఆసుపత్రి సిబ్బందిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో మాజీ పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ కొర్లకుంట నాగేశ్వరరావు, క్యాంపు చైర్మన్ గె ల్లా జగన్మోహన్ రావు, , వైస్ చైర్మన్ బెల్లంపల్లి శ్రీనివాస్, కో చైర్మన్ కనపర్తి కోటేశ్వరరావు, ప్రెసిడెంట్ ఏటుకూరి వెంకటరామారావు, సెక్రటరీ గె ళ్ళ వెంకటరమణ గుప్తా, ట్రెజరర్ దండా రవీంద్రబాబు పాల్గొన్నారు.


Comments