ఓరుగల్లు ప్రజలకు కేంద్రం నుండి మరో హామీ నెరవేర్పు

ఓరుగల్లు ప్రజలకు కేంద్రం నుండి మరో హామీ నెరవేర్పు

కాజీపేట,తెలంగాణ ముచ్చట్లు:

హన్మకొండ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం గ్రేటర్ వరంగల్ 45వ డివిజన్ పరిధిలో అయోధ్యపురంలో కేంద్ర ప్రభుత్వం నిర్మించనున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం మడికొండ చౌరస్తాలో మీడియా సమావేశం నిర్వహించారు వర్ధన్నపేట నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు అరూరి రమేష్.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాజీపేట రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్‌ను అప్‌గ్రేడ్ చేసి కోచ్ ఫ్యాక్టరీగా మారుస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీచేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఇటీవల గిరిజన వర్సిటీ ఏర్పాటు చేసిన కేంద్రం ఇప్పుడు కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేయడం పట్ల ప్రజల్లో ఉత్సాహం నెలకొన్నట్లు తెలిపారు.


WhatsApp Image 2024-11-29 at 8.31.25 PM (1) ఈ కార్యక్రమంలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ధర్మారావు, మాజీ ఎమ్మెల్యేలు వన్నాలశ్రీరాములు, తక్కల్లపల్లి రాజేశ్వరరావు, మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్, జలగం రంజిత్, కరుణాకర్, వెంకట్రావు, గడ్డం మహేందర్, పిట్టల రమేష్, దువ్వ నవీన్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .