పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

విత్తన మొక్కజొన్న పై రైతులకు అవగాహన... 

పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

ఖమ్మం బ్యూరో,నవంబర్ 10, తెలంగాణ ముచ్చట్లు;

సోమవారం  వైరా మండలం గరికపాడు, దాచాపురం ధాన్యం కొనుగోలు కేంద్రాలను వైరా డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ మట్టూరి వెంకటేశ్వర్ రావు , మరియు సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి   ప్రారంభించారు. 
ఈ సందర్భంగా వారు పూర్తిగా ఆరబెట్టిన ధాన్యాన్ని మిల్లులకు పంపవలసిందిగా రైతులకు తెలియజేశారు. 
గన్నీ రమ్మీ సంచులు అందుబాటులో ఉంచుకోవాలని సొసైటీ వారికి తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మంజూఖాన్  వ్యవసాయ విస్తరణ అధికారి సైదులు, సొసైటీ సీఈఓ అంజయ్య  సొసైటీ డైరెక్టర్లు అదేవిధంగా సిబ్బంది రైతులు పాల్గొన్నారు.

విత్తన మొక్కజొన్న పై రైతులకు అవగాహన... 

 అదేవిధంగా గరికపాడు లింగన్నపాలెం గ్రామంలో విత్తన మొక్కుజొన్న వేసే రైతులకు అగ్రిమెంటు లేకుండా కంపెనీ వారు ఇచ్చే మొక్కజొన్నని వేయకూడదని సూచించారు. అగ్రిమెంటు ఉంటేనే మొక్కజొన్న వేసేలా రైతులకు తెలియజేశారు.  రైతులకు నష్టం రాకుండా అగ్రిమెంట్ తీసుకొని విత్తన మొక్కజొన్న వేసుకోవాలని ఆత్మ కమిటీ చైర్మన్,
 మండల వ్యవసాయ అధికారి మాయన్ మంజుఖాన్ తెలియజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .