ఫాధర్ కొలంబో(సిబిఎస్ఈ)

పాఠశాలలో ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు 

ఫాధర్ కొలంబో(సిబిఎస్ఈ)


IMG-20251223-WA0128IMG-20251223-WA0129

స్టేషన్ ఘనపూర్,డిసెంబర్23(తెలంగాణ ముచ్చట్లు):  మండల కేంద్రంలోని ఫాదర్ కొలంబో( సిబిఎస్ఈ) పాఠశాలలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు క్రీస్తు జయంతి నేపథ్యాన్ని కళ్లకు కట్టినట్టుగా ప్రదర్శిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ప్రభు జన్మకు సంబంధించిన సంఘటనలను నాటక రూపంలో చూపించి సందర్శకులను ఆకట్టుకున్నారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఫాదర్ చిన్నయ్య మాట్లాడుతూ, క్రీస్తు జయంతి లోకానికి ఒక మహత్తర పర్వదినమని తెలిపారు. ప్రభు జన్మ ద్వారా ప్రేమ, శాంతి, సమాధానం అనే విలువలు సమాజానికి అందాయని, వాటిని ప్రతి ఒక్కరూ తమ జీవనంలో ఆచరించి పొరుగు వారితో పంచుకోవాల్సిన అవసరం ఉందని సందేశం ఇచ్చారు.క్రిస్మస్ సందేశాన్ని ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ వేడుకలు పాఠశాల ప్రాంగణంలో ఉత్సాహభరిత వాతావరణాన్ని నెలకొల్పాయి.ఈ వేడుకల్లో ఫాదర్ కొలంబో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఫాదర్ థామస్ కిరణ్‌తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సందర్శించిన రజిత పరమేశ్వర్ రెడ్డి ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సందర్శించిన రజిత పరమేశ్వర్ రెడ్డి
ఉప్పల్, జనవరి 07 (తెలంగాణ ముచ్చట్లు): ఉప్పల్ డివిజన్ పరిధిలోని వి.టి.రోడ్, స్వరూప్ నగర్‌లో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఉప్పల్ డివిజన్ కార్పొరేటర్...
నూతన ఎస్సైని మర్యాదపూర్వకంగా కలిసిన మద్దిగట్ల సర్పంచ్ మేకల రాములు
పాలమూరు ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్‌ యాత్ర సిగ్గుచేటు
ఉప్పల్ ఓల్డ్ భరత్ నగర్‌కు రూ.13.25 కోట్ల అభివృద్ధి నిధులు మంజూరు
ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె.!
పిల్లల భద్రతే లక్ష్యం.. బడి బస్సుల తనిఖీలు.
రేపు గంగారం లో విద్యుత్ వినియోగదారుల సదస్సు.