చెరువుల్లో గుర్రపు డెక్కతో దోమల సమస్య తీవ్రం

చెరువుల్లో గుర్రపు డెక్కతో దోమల సమస్య తీవ్రం

_జోనల్ కమిషనర్‌కు సాయిజెన్ వినతి

– పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశాలు

నాచారం, ఏప్రిల్ 13 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్ పరిధిలోని హెచ్ఎంటి నగర్ పెద్ద చెరువు, పటేల్ కుంట చెరువుల్లో విపరీతంగా గుర్రపు డెక్క (వాటర్ హైసింత్) పెరగడంతో దోమల సమస్య తీవ్రమైంది. ఇప్పటికే గుర్రపు డెక్క తొలగింపు పనులకు రూ.1.20 కోట్ల నిధులు మంజూరై రెండు నెలలు గడిచినా, పనులు ప్రారంభం కాలేదని బారాస రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్ జోనల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.అధికారుల నిర్లక్ష్యం వల్లే పనులు ఆలస్యమవుతున్నాయని ఆయన ఆరోపిస్తూ, తక్షణమే గుర్రపు డెక్క తొలగింపు పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ విషయంపై స్పందించిన జోనల్ కమిషనర్ సంబంధిత అధికారులతో మాట్లాడి, వెంటనే పటేల్ కుంట చెరువులో గుర్రపు డెక్క తొలగింపు పనులు ప్రారంభించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కట్ట బుచ్చన్న గౌడ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

అంబేద్కర్ అందరివాడు అంబేద్కర్ అందరివాడు
హన్మకొండ,ఏప్రిల్14(తెలంగాణ ముచ్చట్లు): హనుమకొండలోని అంబేద్కర్ భవన్‌లో జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో వరంగల్ పార్లమెంట్...
పామిరెడ్డిపల్లిలో అంబేద్కర్ జయంతి వేడుకలు .
అంబేద్కర్ ఆశయాల సాధనతోనే సమాజంలో నిజమైన సమానత్వం సాధ్యం .
యువత అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి చెందాలి.
చిన్నపెండ్యాలలో  ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు .
అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహానికి ఘన నివాళులు.
మేడ్చల్–మల్కాజిగిరిలో అంబేద్కర్ జయంతి వేడుకలు.