నల్లబెల్లి గ్రామంలో ఐకేపీ సెంటర్ ప్రారంభం
నల్లబెల్లి,తెలంగాణ ముచ్చట్లు:
వర్ధన్నపేట మండలంలోని నల్లబెల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కోసం ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్ను ఇల్లంద వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ నరుకుడు వెంకటయ్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమం వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు ఆదేశాల మేరకు నిర్వహించబడింది.
ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ, ఎమ్మెల్యే నాగరాజు చొరవతో జిల్లా కలెక్టర్ నుండి అనుమతి తీసుకుని ఐకేపీ సెంటర్ ప్రారంభం సాధ్యమైందని పేర్కొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఈ సౌకర్యం కొంచెం ఆలస్యమైందని, కానీ గ్రామస్థులు మరియు మహిళా సంఘాలు సెంటర్ ప్రారంభం పట్ల సంతోషం వ్యక్తం చేశారన్నారు.
వెంకటయ్య మాట్లాడుతూ, సన్నరకం వరికి రూ.500 బోనస్ అందించడం, రెండు లక్షల రుణమాఫీ వంటి చర్యలతో రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్లు మాలతి రెడ్డి, మల్యాల దేవేందర్, గ్రామ ప్రజలు, మహిళా సంఘాలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments