విమానాశ్రయంలో తెలంగాణ పర్యాటక సమాచార కేంద్రం ప్రారంభం
హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:
తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ పర్యాటకులకు మరింత చేరువగా సేవలందించేందుకు శంషాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక పర్యాటక సమాచార కేంద్రాన్ని ప్రారంభించింది.
ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. పర్యాటక రంగంలో కొనసాగుతున్న సంస్కరణల భాగంగా పర్యాటకులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ఈ సమాచార కేంద్రం ద్వారా రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలు, హోటళ్లు, టూర్ ప్యాకేజీలు, రిజర్వేషన్లు, రూట్ మ్యాప్ వంటి వివరాలను పర్యాటకులకు అందిస్తారు..jpeg)
ఈ కేంద్రం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సేవలందించనుంది. ఇప్పటికే బషీర్బాగ్, బేగంపేట, కూకట్పల్లి, సికింద్రాబాద్, శిల్పారామం వంటి ప్రాంతాల్లో పర్యాటక సమాచార కేంద్రాలు విజయవంతంగా సేవలందిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, సంచాలకులు జెండగే హనుమంతు కొండిబా, జీఎంఆర్ సీఈవో ప్రదీప్ ఫణిక్కర్ తదితరులు పాల్గొన్నారు.


Comments