అర్హులైన పేదలందరికి ఇందిరమ్మ ఇల్లు — కడియం శ్రీహరి
అత్యంత కొలహాలంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ
స్టేషన్ ఘనపూర్, అక్టోబర్ 14 (తెలంగాణ ముచ్చట్లు):
స్టేషన్ ఘనపూర్ పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. లబ్ధిదారులు ఆనందంతో ముంచెత్తారు. కార్యక్రమానికి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, జనగామ జిల్లా అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ ప్రధాన అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని గ్రామాలకు చెందిన 256 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. అలాగే డీఆర్డీఏ ఆధ్వర్యంలో వ్యవసాయ మోటార్లు పంపిణీ చేశారు.
కడియం శ్రీహరి ప్రసంగం
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని పేద ప్రజల స్వంత ఇంటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు.
ఆయన వివరించిన ప్రకారం —
రాష్ట్రవ్యాప్తంగా ₹22,500 కోట్ల వ్యయంతో 4.5 లక్షల ఇళ్ల నిర్మాణం కొనసాగుతోంది.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో 3,500 ఇళ్లు మంజూరు అయ్యాయి.
ఇప్పటి వరకు 3,360 ఇళ్లకు పత్రాలు అందజేయగా, అందులో 95 శాతం ఇళ్లు పనులు ప్రారంభమయ్యాయి.
.jpeg)
రాబోయే 2–3 నెలల్లో మరో 3,500 ఇళ్లు మంజూరు అవుతాయని తెలిపారు. అర్హులైన ప్రతి పేదకూ ఇందిరమ్మ ఇల్లు తప్పక అందుతుందని, ఎవరికీ ఒక్క రూపాయి లంచం ఇవ్వవద్దని హెచ్చరించారు.
లబ్ధిదారులు వెంటనే పనులు ప్రారంభించాలని సూచిస్తూ, బ్యాంక్ అకౌంట్లు, ఆధార్ లింకేజీ సరిచూడాలని చెప్పారు. అధికారులు లబ్ధిదారులకు అందుబాటులో ఉండి సకాలంలో బిల్లులు అందేలా చూడాలని ఆదేశించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి మహిళా సంఘాల ద్వారా లోన్లు మంజూరు చేసేలా ఎంపీడీవోలు చర్యలు తీసుకోవాలని సూచించారు.
అర్హులైన పేదలందరికీ స్వంత ఇంటి కల నెరవేరడం తమ సంకల్పమని తెలిపారు.
డాక్టర్ కడియం కావ్య ప్రసంగం
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మహిళల పక్షపాతిగా నిలుస్తుందని ఎంపీ డాక్టర్ కడియం కావ్య తెలిపారు. మహిళలు బాగుపడితేనే దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ₹500కి వంట గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలు అమలు చేస్తున్నదని వివరించారు.
గత పాలకులు స్టేషన్ ఘనపూర్ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నాయకత్వంలో ఆ ప్రాంతం అభివృద్ధి దిశగా సాగుతోందని తెలిపారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి 1,075 కోట్ల రూపాయలతో విస్తృత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఎంపీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారుజనగామ, హన్మకొండ హౌసింగ్ పీడీలు మాతృ నాయక్, హరికృష్ణ, ఆర్డీవో వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, డీఈలు, ఏఈలు, ఎంపీడీవోలు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.


Comments