ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసుకోవాలి
హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి
హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసుకోవాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎ. వెంకట్ రెడ్డి అన్నారు.బుధవారం హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని పలువురు లబ్ధిదారులకు చెందిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన అదనపు కలెక్టర్ వాటి పురోగతి గురించి, పనులు పూర్తి చేయడంపై లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.
వీలైనంత త్వరగా ఇండ్ల నిర్మాణ పనులను పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. అనంతరం పరకాల పురపాలక సంఘం కార్యాలయంలో కమిషనర్ సుష్మ, వార్డు అధికారులతో సమావేశం నిర్వహించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతంగా సాగే విధంగా, బిల్లుల చెల్లింపు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా నడికూడ తహసీల్దార్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ సందర్శించి భూభారతి దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను పరిశీలించి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు.


Comments