పరీక్షల్లో ఫెయిల్ అవుతుందనే భయంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

పరీక్షల్లో ఫెయిల్ అవుతుందనే భయంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

మంచిర్యాలతెలంగాణ ముచ్చట్లు: పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో చోటు చేసుకుంది.

షెట్‌పల్లి గ్రామానికి చెందిన హాసిని (18) చెన్నూరు కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఇంటర్మీడియట్ చదివేది. చదువు ఇష్టం లేకపోవడంతో ఇంటికి వచ్చింది. అయితే, మళ్లీ బలవంతంగా మంచిర్యాలలోని ప్రైవేట్ కళాశాలలో తండ్రి చేర్పించాడు.

ఇంటర్ పరీక్షలు దగ్గరపడుతుండడంతో ఒత్తిడికి గురైన హాసిని, ఫెయిల్ అవుతాననే భయంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటన విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడి, చదువు పై భయాందోళనలను మరోసారి ప్రశ్నించేలా చేసింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .