బీసీ సంక్షేమ సంఘ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఇజ్జరాతి నాగేశ్వరావు

బీసీ సంక్షేమ సంఘ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఇజ్జరాతి నాగేశ్వరావు
జిల్లా నియామక పత్రాన్ని అందజేస్తున్న ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు

 కాజీపేట్ అక్టోబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు) 

హనుమకొండ జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షునిగా ఇజ్జరాతి నాగేశ్వరరావు( చిన్న) ను  నియమిస్తూ వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ. వేణుగోపాల్ గౌడ్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాలుగా హనుమకొండ జిల్లాలో బీసీ కులాల ఐక్యత కోసం చేస్తున్న కృషిని గుర్తించి తనకు ఈ పదవి రావడం వల్ల తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు జాజుల. శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర అధ్యక్షుడు బైరి. రవి కృష్ణ ,వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ. వేణుగోపాల్ గౌడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాడి. మల్లయ్య యాదవ్ బీసీ జేఏసీ వరంగల్ ఉమ్మడి జిల్లా వైస్ చైర్మన్ బోనగాని. యాదగిరి గౌడ్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. హన్మకొండ నగరంలో బీసీ కులాలను చైతన్యం చేస్తూ బీసీ లందర్ని ఏకతాటిపైకి తీసుకొని వచ్చి  రాజ్యాధికారం వచ్చేలా తాను ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. బీసీలు చైతన్యవంతులై రాజకీయ రంగాలలో చురుగ్గా పాల్గొని తమదైన శైలిలో రాజ్యాధికారాన్ని దక్కించుకోవాలని ఆయన కోరారు.

నాగేశ్వరరావు ఎంపిక పట్ల పలువురి హర్షం

ఇజ్జరాతి నాగేశ్వరావు హనుమకొండ జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులుగా పదవిని ఇవ్వడం పట్ల అంజిరెడ్డి,  నాగేష్, చందు, ధనుంజయరావు, యాకూబ్, అభి , పప్పీ  మార్బుల్ అండ్ గ్రానైట్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ మహమ్మద్ భాష లతోపాటు ఉస్మాన్ భాష అంకుష్ భాష లతోపాటు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .