ప్రపంచ శాంతి దూత జీసస్
క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్
ఖమ్మం బ్యూరో,తెలంగాణ ముచ్చట్లు:
మానవాళికి జీసస్ ఇచ్చిన సందేశాలు, బోధనలు ప్రస్తుత మానవ జీవనానికి ఎంతో అవసరమని, డిసిసి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ అన్నారు. క్రిస్టమస్ సందర్భంగా పలు చర్చిలలో జరిగిన ప్రార్థన కార్యక్రమాల్లో పాల్గొని మల్లి బాబు యాదవ్ కేక్ కట్ చేసి మత విశ్వాసకులకు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో సత్యం శాంతి అహింస విధానాలతో ప్రపంచం శాంతివంతంగా ఉంటుందని, పరమత సహనం పాటించాలని, క్రీస్తు చేసిన బోధనలు ప్రపంచశాంతికి ఆదర్శ మార్గమని, మల్లి బాబు యాదవ్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బానోతు నరసింహ నాయక్, పాస్టర్లు, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు పాటిబండ్ల ప్రసాద్, గుండ్ల ఏసోబు, సామేలు మంజుల ప్రీతి, గుండ్ల చిరంజీవి, సునీల్, ఆదూరి శ్రీను మోదుగు ఆనందరావు, గుండ్ల వెంకటరత్నం, మోదుగు సుధాకర్, ఆ దూరి రాంబాయి, దయామణి, మరియు మత విశ్వాసకులు మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు


Comments