వేంసూరులో కొత్త ఎంపీడీఓగా కావ్య బాధ్యతలు స్వీకరణ.
సిబ్బంది ఆత్మీయ స్వాగతం.
Views: 109
On
వేంసూరు, అక్టోబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):
ఖమ్మం జిల్లా, వేంసూరు మండలానికి నూతన ఎంపీడీఓగా డి.కావ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గ్రూప్-1 ద్వారా ఎంపికై తొలిసారి ఇక్కడే పదవీ బాధ్యతలు చేపట్టడం విశేషం. ఇప్పటి వరకు విధులు నిర్వహించిన పరిమి రాజారావు అధికారికంగా బాధ్యతలను కావ్యకు అందజేశారు.
కార్యాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది కొత్త ఎంపీడీఓని ఆత్మీయంగా స్వాగతించారు. కార్యాలయ మర్యాదలతో పుష్పగుచ్ఛాలు ఇచ్చి, శాలువ కప్పి, మిఠాయి తినిపించి సత్కరించారు.
ఈ సందర్భంగా ఎంపీడీఓ కావ్య మాట్లాడుతూ, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పారదర్శక పరిపాలనను చేపడతా. గ్రామీణాభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలి అని తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments