సీపీఎం వేంసూరు కార్యదర్శిగా మల్లూరు చంద్రశేఖర్ ఏకగ్రీవ ఎన్నిక.
Views: 25
On
సత్తుపల్లి, ఆగస్టు 22 (తెలంగాణ ముచ్చట్లు):
ఖమ్మం జిల్లా వేంసూరు మండల కేంద్ర సీపీఎం శాఖ కార్యదర్శిగా సీపీఎం, సీఐటీయూ సీనియర్ నాయకుడు మల్లూరు చంద్రశేఖర్ శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక స్థానిక ఎర్రా రామయ్య భవనంలో జరిగింది.
ఎన్నిక అనంతరం మీడియాతో మాట్లాడిన మల్లూరు చంద్రశేఖర్ వేంసూరు మండల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, అవసరమైతే ప్రజా పోరాటాలు నిర్వహిస్తానని తెలిపారు.కొత్తగా ఎన్నికైన మల్లూరుకు పార్టీ సహచరులు, అభిమానులు, స్థానిక నేతలు అభినందనలు తెలిపారు
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments