సాకేత్ కాలనీ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
కాప్రా, అక్టోబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సాకేత్ కాలనీ అభివృద్ధి కోసం అన్ని విధాలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.బుధవారం కాప్రా డివిజన్ పరిధిలోని సాకేత్ కాలనీలో రూ.44 లక్షల వ్యయంతో చేపట్టిన రోడ్డు మరియు స్టార్మ్ వాటర్ డ్రైన్ పనులను ఎమ్మెల్యే ప్రధాన అతిథిగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ — సాకేత్ కాలనీలో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని, ప్రజల అభ్యర్థనల మేరకు అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు భైరీ నవీన్ గౌడ్, సాకేత్ కాలనీ అధ్యక్షులు జి.ఎస్.రావు, జాయింట్ సెక్రటరీ రవీందర్ రావు, కోశాధికారి చంద్రశేఖర్, రాజేశ్వర్ రావు, నిరంజన్ రావు, జగన్నాథ రావు, శ్రీనివాసరావు, సాకేత్ స్వర్ణ అధ్యక్షులు సురేందర్ రెడ్డి, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.


Comments