సత్తుపల్లి ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేసిన: ఎమ్మెల్యే మట్టా

సత్తుపల్లి ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేసిన: ఎమ్మెల్యే మట్టా

సత్తుపల్లి, అక్టోబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సేవల నాణ్యతను మరింత మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే మట్టా రాగమయి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది హాజరు రిజిస్టర్లను పరిశీలించడంతో పాటు, చికిత్స పొందుతున్న రోగుల పరిస్థితి, వారికి అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యతపై ప్రత్యక్షంగా సమాచారం సేకరించారు.

తనిఖీ సందర్భంగా ఆసుపత్రి లో పరిశుభ్రత లోపాలు గమనించి తక్షణమే పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. రోగులకు ఇచ్చే ఆహార నాణ్యత, శానిటేషన్, వాష్‌రూమ్ నిర్వహణ వంటి అంశాలపై కూడా సూచనలు ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందన వేగం పెంచాలని ఎమర్జెన్సీ విభాగం అధికారులను కోరారు.

తదుపరి, నిర్మాణంలో ఉన్న 100 పడకల కొత్త ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు. స్థానిక ప్రజలకు మెరుగైన ఆరోగ్య సదుపాయాలు అందుబాటులోకి రావాల్సి ఉన్న నేపథ్యంలో పనులను ఆలస్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత శాఖల ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. పరికరాలు, మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వివరించారు.

ఆరోగ్య రంగ అభివృద్ధి ప్రభుత్వ ప్రాధాన్య రంగమని, ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం సహించబోమని ఎమ్మెల్యే స్పష్టం చేసినట్టు సమాచారం.


WhatsApp Image 2025-10-27 at 6.43.03 PMఈ కార్యక్రమంలో సత్తుపల్లి పట్టణ మున్సిపల్ కమిషనర్ నరసింహ, కాంగ్రెస్ పార్టీఅధ్యక్షులు గాదె చెన్నకేశవరావు, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

వందేమాతరం గీతం – దేశభక్తికి ప్రతీక వందేమాతరం గీతం – దేశభక్తికి ప్రతీక
-మన స్వాతంత్ర్య సమరయోధులలో  ఆత్మవిశ్వాసాన్ని రగిలించిన గీతం  -ఎస్సై ఏ. ప్రవీణ్ కుమార్  ఎల్కతుర్తి. నవంబర్ 07(తెలంగాణ ముచ్చట్లు): స్వాతంత్ర్య సమరయోధులలో ఆత్మవిశ్వాసం, త్యాగస్ఫూర్తిని రగిలించిన వందేమాతరం...
సెయింట్ థామస్ అల్టిట్యూడ్ హైస్కూల్లో ఘనంగా “వందేమాతరం 150 ఏళ్ల” సంబరాలు
నిరూపయోగంగా పబ్లిక్ టాయిలెట్లు 
జూబ్లీహిల్స్ లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే -నగరాభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం
ఈసీఐఎల్ మెగా జూనియర్ కాలేజీలో సామూహిక వందేమాతరం గానం
రాచకొండ కమిషనరేట్‌లో వందేమాతర గీతం 150 ఏళ్ల వేడుకలు
కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో సామూహిక వందే మాతరం గానం