వరద బాధితులకు అండగా ఎం పి జె
Views: 9
On
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
మున్నేరు వరద భీభత్సవానికి ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాలు జలమయమై, ప్రజలు తీవ్ర నష్టానికి గురయ్యారు. అందులో పలు పేద కుటుంబాలు సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. స్థానిక 47 వ డివిజన్ బొక్కల గడ్డ వెంకటేశ్వరా నగర్ లోని వరద బాధితులకు మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఖమ్మం శాఖ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం, బట్టలు, దుప్పట్లు తదితర వస్తువులను పంపిణీ చేయడం జరిగింది. ఎంపీజే జిల్లా అధ్యక్షులు షేక్ ఖాసిం నిరాశ్రయులైన వరద బాధితుల సమస్యలను అడిగి తెలుసుకుని, ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాలను ఆడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీజే జిల్లా కార్యదర్శులు బొగ్గవరపు సతీష్, సయ్యద్ రఫీక్, కోశాధికారి మొహమ్మద్ హకీమ్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments