నారాయణపురంలో కొత్త వెలుగు”

నారాయణపురంలో కొత్త వెలుగు”

ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:

కల్లూరు మండలంలోని నారాయణపురం గ్రామం గురువారం తెల్లవారుజామున ఉత్సాహభరిత వాతావరణంలో మేల్కొంది. తెలంగాణ  రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్వగ్రామంలో నిర్మించిన నూతన గృహంలో గృహప్రవేశ మహోత్సవం ఘనంగా జరిగింది.

ఉదయం 4.30 గంటల శుభముహూర్తం రాగానే వేదపండితుల మంత్రోచ్ఛారణలతో పవిత్ర పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. యజ్ఞవేదిక ముందు వెలిగిన పవిత్ర జ్యోతి, కొత్త ఇంటి గోడలపై అలంకరించిన తోరణాలు గ్రామానికి పండుగ వాతావరణం తెచ్చాయి.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస రెడ్డి తన సతీమణి మాధురి, తల్లి స్వరాజ్యం, సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి – శ్రీలక్ష్మి దంపతులతో కలిసి పూజల్లో పాల్గొన్నారు.

గ్రామమంతా ఆనందోత్సాహాలతో నిండిపోయింది. పెద్దలు, బంధువులు, స్నేహితులు, స్థానికులు  హాజరై మంత్రి కుటుంబసభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త గృహ గడప దాటిన క్షణంలో గ్రామమంతా హర్షధ్వానాలతో మార్మోగింది.

ఈ గృహప్రవేశం కేవలం ఒక శుభకార్యం మాత్రమే కాIMG-20250731-WA0154కుండా, నారాయణపురం ప్రజలకు గర్వకారణం, స్వగృహ గౌరవంగా నిలిచింది. గ్రామ సాక్షిగా బంధుత్వం, ఆప్యాయత, ఆనందం కలసిన ఆ క్షణాలు చిరస్మరణీయమయ్యాయి.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .