పింఛన్ లేక ఆర్థిక ఇబ్బందులు – కలెక్టర్ దృష్టికి లలిత ఆవేదన

పింఛన్ లేక ఆర్థిక ఇబ్బందులు – కలెక్టర్ దృష్టికి లలిత ఆవేదన

మహబూబునగర్,నవంబర్ 10(తెలంగాణ ముచ్చట్లు):

అడ్డాకల్ మండలం బలీదుపల్లి గ్రామానికి చెందిన మంద లలిత తన భర్త మరణించి మూడు సంవత్సరాలు గడిచినా ఇప్పటివరకు ప్రభుత్వం నుండి వితంతు పింఛన్ మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
ఒంటరిగా జీవనోపాధి లేని పరిస్థితుల్లో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆమె తెలిపింది.

ఈ మేరకు లలిత జిల్లా ప్రజావాణి లో మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి కి ఫిర్యాదు చేసింది.
ఆమె విన్నపాన్ని గమనించిన కలెక్టర్ వెంటనే డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ నరసింహులను దరఖాస్తు పరిశీలించమని ఆదేశించారు.

కలెక్టర్ సూచనలతో నరసింహులు అడ్డాకల్ మండలం ఏపీఎం మహేష్ కు చరవాణి ద్వారా మంద లలితను మహిళా సంఘం గ్రూపులో చేర్చించి, సంఘం ద్వారా రుణం మంజూరు చేయాలని ఆదేశించారు.
అలాగే ప్రభుత్వం నుండి లలితకు వితంతు పింఛన్ త్వరితగతిన మంజూరు చేయిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు.

ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడిచిన పింఛన్ దరఖాస్తులు స్వీకరించిన కొత్త పింఛన్లు మంజూరు కాకడపోవడంతో రాష్ట్రంలో లలిత లాంటి ఎంతో మంది మహిళలు భర్తలు లేక ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతూ..పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఇకనైనా ప్రభుత్వం పింఛన్ మంజూరు కోసం చర్యలు చేపట్టాలని మహిళలు కోరుతున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .