అతిధి అధ్యాపకుల సమస్యలపై ఖమ్మం ఎంపీ కి వినతి పత్రం
ఖమ్మం బ్యూరో,తెలంగాణ ముచ్చట్లు:
ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహయం రఘురాం రెడ్డి కలిసిన తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ల అతిధి అధ్యాపకులు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కి రాగానే తక్షణమే తెలంగాణ రాష్ట్రం లో పనిచేస్తున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుల కు మినిమం టైం స్కేల్ ద్వారా 50,000/- జీతం మరియు ఎటువంటి షరతులు లేకుండా ప్రతి సంవత్సరం అతిధి అధ్యాపకుల ను కొనసాగింపు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హన్మకొండ సభలో చెప్పారు అని తక్షణమే న్యాయమైన హామీని అమలు పరిచే విషయం పై సీఎం తమ సమస్యలను తెలియపరిచి పరిష్కారం చూపాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘు రాం రెడ్డి కి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ముసుకు. రాజీ రెడ్డి, కొమ్ము అభిజిత్ దేవ్, ఖమ్మం జిల్లా అధ్యక్షులుపేరెల్లి శ్రీను,జిల్లా జనరల్ సెక్రటరీ కొమ్ము.నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు కొమ్మినేని వీరన్న, జిల్లా కోశాధికారి వనం. పుల్ల రావు, ఇతర సీనియర్ అధ్యాపకులు అప్పారావు, ఉపేందర్, శ్రీనివాస్ రావు,ఉష పావని తదితరులు పాల్గొన్నారు.


Comments