రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో దర్గాలో పూజలు
కాజీపేట తెలంగాణ ముచ్చట్లు
కాజీపేటలో ఏర్పాటు చేస్తున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు ఎటువంటి ఆటంకాలు జరగకుండా పనులు సకాలంలో పూర్తి కావాలని కోరుతూ రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో శనివారం కాజీపేటలోని దర్గాలో పూజలు నిర్వహించారు. గత నెల 24 నుండి తెలంగాణ రైల్వే ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు త్వరగా పూర్తి కావాలని, అదేవిధంగా స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ సర్వమత పూజలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నేడు కాజీపేట అఫ్జల్ బీయబాని దర్గా ను సందర్శించి దర్గా పీఠాధిపతి ఖుసుర్ పాషా ఆశీస్సులతో దర్గాలో పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైల్వే జేఏసీ కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్, చైర్మన్ కొండ నర్సింగరావు కో కన్వీనర్ మహేష్, రవీందర్, భాస్కర్ , మాధవరావు నాగేష్, రాజలింగం, వైస్ చైర్మన్లు రవీందర్, ప్రవీణ్ లక్ష్మీనారాయణ, ఉదయ, భాస్కర్, సంపత్ స్థానిక మాజీ కార్పొరేటర్ అబ్బు బక్కర్ తదితరులు పాల్గొన్నారు.


Comments