ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి 

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి 
ఫోటో రైట్ అప్స్ రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

కాజీపేట్ తెలంగాణ ముచ్చట్లు

 కాజిపేట్ లోని  డిజిల్ కాలనీ చౌరస్తాలో 47 వ డివిజన్ అధ్యక్షుడు షేక్ అజ్గర్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 81వ జయంతి ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కటింగ్ చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ సమాచార విప్లవానికి ఆధ్యుడని, దేశంలో ఐటీ రంగానికి పునాదులు వేసిన మహానీయుడని కొనియాడారు. దేశంలో కంప్యూటర్ కమ్యూనికేషన్ అభివృద్ధి చెందాయి అంటే రాజీవ్ గాంధీ చొరవఅని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు   జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ఇప్ప. శ్రీకాంత్, మైసారపు.సిరి లారెన్స్,పసునూరి. మనోహర్, దొంగల కుమార్ యాదవ్, బిలాల్, తమ్మడి మధు, దువ్వ రాజులు, కొమురవెల్లి రమేష్, కాలేశ్వరం వంశీ, ఎండి మదర్, మహేష్, శోభనమైన బిక్షపతి, మాతంగి స్వామి, సిరిపాక కుమార్, స్వామి, రేణుక, సల్లూరి నాగేశ్వరరావు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .