కీసరలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలు
కీసర,ఆగస్టు18(తెలంగాణ ముచ్చట్లు):
కీసర మండలం చీర్యాల గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం రోజు వనందాస్ లక్ష్మీనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బహుజన ధీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని, పీడిత జనుల కోసం, బహుజనుల ఆత్మగౌరవం కోసం తన సర్వస్వాన్ని అర్పించిన మహాయోధుడు అని కొనియాడారు. నిరంకుశ పాలనకు ఎదురొడ్డి అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన పాపన్న గౌడ్ తెలంగాణ నేలలో పుట్టడం గర్వకారణమని తెలిపారు.
అలాగే సామాజిక, రాజకీయ సమానత కోసం ఆయన చేసిన పోరాటం భావితరాలకు మార్గదర్శకమని, పాపన్న గౌడ్ వీరత్వం తరతరాలకు స్ఫూర్తినిచ్చేలా కొనసాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామ గౌడ సంఘం సభ్యులు, రాజకీయ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


Comments