ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపిక.

క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియను సజావుగా నిర్వహించాలి

ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపిక.

మెదక్ ఆర్డీవో రమాదేవి.

మెదక్ బ్యూరో తెలంగాణ ముచ్చట్లు:

మెదక్ పట్టణంలో  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా  లబ్ధిదారుల ఎంపికకు కసరత్తును గురువారం ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో జరుగుతోన్న సర్వే సరళిని పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా మెదక్ ఆర్డీవో రమాదేవి మాట్లాడుతూ దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న నిరుపేదలను గుర్తించాలని, భూములు, ఆదాయం, వంటి వివరాలను తప్పులు లేకుండా ఫార్మ్ లో నమోదు చేయాలని ఆదేశించారు.
ఈ సర్వేలో భాగంగా విచారణలో తేలిన వివరాల ఆధారంగా అర్హుల జాబితాను రూపొందించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ తాసిల్దార్ లక్ష్మణ్ బాబు,ఆర్ ఐ లక్ష్మణ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .