ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలి

-అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ 

ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలి

 ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ తెలిపారు. శుక్రవారం మధిర మండల తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్, ధరణి పెండింగ్ దరఖాస్తులు, ప్రజావాణి అర్జీల పరిష్కారం, ఓటరు జాబితా సవరణ పై రెవెన్యూ అధికారులతో మధిర నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధరణి పెండింగ్ దరఖాస్తులను రోజువారి లక్ష్యం ఏర్పరచుకొని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని, సోమవారం స్వీకరించిన దరఖాస్తులు, ఆ వారంలోనే, శుక్రవారం లోగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. తిరస్కరించిన దరఖాస్తుల విషయమై కారణాలు అర్జీదారునికి తెలుపాలన్నారు. ఓటరు జాబితా సవరణలో పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు. ఇంటింటి సర్వే పటిష్టంగా జరగాలని, ఎన్నికల సంఘం నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని అన్నారు. అర్హతగల ప్రతిఒక్కరు ఓటుహక్కు పొందేలా ప్రణాళికాబద్ద చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ అన్నారు.

    ఈ సమీక్ష లో మధిర నియోజకవర్గ తహసీల్దార్లు, నాయబ్ తహశీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .