సత్తుపల్లి బీసీ కాలేజ్ హాస్టల్లో తల్లిదండ్రులతో ఆత్మీయ సమావేశం.!
Views: 29
On
సత్తుపల్లి, సెప్టెంబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి పట్టణం, బీసీ కాలేజ్ హాస్టల్లో తల్లిదండ్రులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని బీసీహెచ్డబ్ల్యుఓ, ఐన.అశోక్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
హాస్టల్లో ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన భోజనం, చదువు సదుపాయాలు, ఇతర ప్రభుత్వ వసతులపై తల్లిదండ్రులకు వివరాలు తెలియజేశారు. అంతేకాక విద్యా విషయాలపై, రాబోయే పోటీ పరీక్షలపై విద్యార్థులకు మార్గదర్శక సూచనలు చేశారు.
జేవీఆర్ కాలేజీ లెక్చరర్, ఐన. కృష్ణారావు, డీఏవి స్కూల్ టీచర్ జైరాజ్, సిద్ధారం స్కూల్ టీచర్ లక్ష్మణాచారి, నరేష్,
బీసీ కాలేజ్ బాలికల హెచ్డబ్ల్యుఓ హేమలత సమావేశంలో పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.
విద్యార్థుల తల్లిదండ్రులు యాలాద్రి, తిరుపతిరావు, హైమావతి, శ్రీను, రవి, హాస్టల్ వర్కర్ వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments