విద్యార్థి జీవితంలో క్రీడలు ఎంతో ముఖ్యం

-రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

విద్యార్థి జీవితంలో క్రీడలు ఎంతో ముఖ్యం

 హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు: 

ప్రతి విద్యార్థి జీవితంలో క్రీడలు ఎంతో ముఖ్యమని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి   మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 
గురువారం హనుమకొండ జేఎన్ఎస్ లో రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్ పోటీలను తెలంగాణ స్టేట్ అథ్లెటిక్ అసోసియేషన్ చైర్మన్ శివసేనా  రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. 

 వర్చువల్ విధానం ద్వారా రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడారు. 

 మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక వికాస దృఢత్వానికి దోహదపడతాయన్నారు. క్రీడలు నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయన్నారు. సహనము, క్రమశిక్షణ, తదితర నైపుణ్యాలను క్రీడలు పెంపొందిస్తాయన్నారు. క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం  అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు. క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు అభినందనలు తెలియజేశారు. 

 రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా చీఫ్ మినిస్టర్స్ కప్ పోటీలు పండగ వాతావరణం లో జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో జిమ్నాస్టిక్స్ అనగానే ఓరుగల్లు గుర్తుకు వస్తుందన్నారు.  ఇక్కడి క్రీడాకారులు  జాతీయ అంతర్జాతీయ పోటీలలో పాల్గొన్నారని గుర్తు చేశారు. కోచ్ లుగా, క్రీడాధికారులుగా  పనిచేశారన్నారు. హనుమకొండ లో జరుగుతున్న  రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్స్ పోటీలలో 15 జిల్లాల నుంచి 200 మంది బాలబాలికలు, 50 మంది అధికారులు పాల్గొంటున్నారని అన్నారు.

 మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ చీఫ్ మినిస్టర్స్ కప్ పోటీలలో భాగంగా  నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్స్ లో క్రీడాకారులు తమ ప్రతిభను చాటాలన్నారు.  

 వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి దోహదపడతాయన్నారు. ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటున్న క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

 రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్స్ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. 

 ఈ సందర్భంగా శివసేనారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జూన్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభం కాబోతుందన్నారు. గత 10 ఏళ్లలో  స్పోర్ట్స్ కు తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారుల ప్రతిభను గుర్తించేందుకు క్రీడలను నిర్వహిస్తుందన్నారు. విద్యార్థులు క్రీడల్లో రాణించే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా క్రమశిక్షణ అలవడుతుందని, చెడు వ్యసనాల వైపు మళ్లకుండా ఉంటారని అన్నారు. చదువులతోపాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలన్నారు. క్రీడల్లో రాష్ట్రానికి దేశానికి మంచి పేరును తీసుకురావాలన్నారు. 

 హనుమకొండ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ గ్రామ,మండల, జిల్లాస్థాయిలలో క్రీడలలో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని అన్నారు.  క్రీడలలో తమ ప్రతిభను చాటుకోవాలని ఆకాంక్షించారు. క్రీడలలో ఒకరు మాత్రమే విజయం సాధిస్తారని తెలిపారు. ముంబై నుంచి వచ్చిన క్రీడా అధికారులు క్రీడాకారులలో ని ప్రతిభను గుర్తిస్తారని అన్నారు. క్రీడలలో ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. చీఫ్ మినిస్టర్స్ కప్ జిల్లాస్థాయి  పోటీలు ముగియగా ప్రతిభ చాటిన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి అజీజ్ ఖాన్,  జిల్లా యువజన క్రీడల అధికారి అశోక్ కుమార్, ఇతర అధికారులతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు.WhatsApp Image 2024-12-19 at 7.49.37 PM (1)

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .