వి.ఎస్.టి కాలనీ, స్నేహపూర్ లో రోడ్డు నిర్మాణ పనులను పర్యవేక్షించిన
కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్
నాచారం, అక్టోబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ నాచారం డివిజన్ పరిధిలోని వి.ఎస్.టి కాలనీ మరియు స్నేహపూర్ ప్రాంతాలలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ గురువారం ప్రత్యక్షంగా పరిశీలించారు. స్థానిక ప్రజల సౌకర్యార్థం, రాకపోకలకు అంతరాయం లేకుండా రోడ్లను నాణ్యతతో నిర్మించాలంటూ ఆయన సూచించారు. సుమారు రూ.20 లక్షల వ్యయంతో జరుగుతున్న ఈ పనులు త్వరితగతిన పూర్తవ్వాలని ఇంజనీరింగ్ అధికారులకు కార్పొరేటర్ ఆదేశాలు జారీ చేశారు. పనుల నాణ్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని హెచ్చరించారు. అభివృద్ధి పనులు పూర్తయ్యాక కాలనీ వాసులు ఎదుర్కొంటున్న మురికి, నీటి నిల్వలు, దుమ్ము సమస్యలు తగ్గుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రజా సమస్యలను దశలవారీగా పరిష్కరించడం మాకు ప్రాధాన్యం. ప్రతి కాలనీకి అవసరమైన మౌలిక సదుపాయాలు అందించేందుకు కృషి చేస్తున్నాం,”
అని శాంతి సాయిజెన్ శేఖర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఈ వినీత్, వర్క్ ఇన్స్పెక్టర్ విజయకుమార్, టిఆర్ఎస్ నాయకులు సాయి జెన్ శేఖర్, సువర్ణ, సుగుణాకర్ రావు, వాసు, రోహిత్, బాబర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలు కార్పొరేటర్ చర్యలను అభినందించారు.


Comments