జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి
వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
వరంగల్,తెలంగాణ ముచ్చట్లు:
కోర్టులో పెండింగులో ఉన్న కేసుల పరిష్కారం కోసం జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నెల 14వ తేదీన డిసెంబర్ 14వ తేదీన జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అన్ని కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని ఆయన ప్రకటించారు.
ఈ లోక్ అదాలత్లో చట్టరీత్యా రాజీకి అర్హమైన క్రిమినల్ కేసులతో పాటు రాజీపడదగిన సివిల్ కేసులు, భూ వివాదాలు, వాహన ప్రమాద పరిహార కేసులు, చిట్ఫండ్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, వైవాహిక కేసులు, తగాదాలు, ట్రాఫిక్ కేసులు తదితర అన్ని కేసులకు సంబంధించి సత్వర పరిష్కారాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు.
ఇరువర్గాల కక్షిదారులు ఈ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో ఏ.ఎస్.పి మనాన్ భట్, అదనపు డిసిపి రవి, సిసిఆర్బి ఇన్స్పెక్టర్లు శ్రీధర్ రావు, శ్రీనివాస్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.


Comments