ఘనంగా శ్రీశ్రీశ్రీ కోమటోళ్ళ మైసమ్మ దేవాలయ దశమ వార్షికోత్సవ మహోత్సవాలు
వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామం జాతీయ రహదారి 44 దగ్గర ఉన్నటువంటి శ్రీశ్రీశ్రీ కొమటోళ్ల మైసమ్మ దేవాలయ దశమ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. శుక్రవారం 400 కేవి విద్యుత్ సబ్స్టేషన్ అధికారుల ఆధ్వర్యంలో మైసమ్మ దేవాలయ దశమ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మైసమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దశమ వార్షికోత్సవం సందర్భంగా గ్రామానికి చెందిన ఆర్ పెద్ద శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీనివాసరెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. వార్షికోత్సవ పూజలో భాగంగా అభిషేకాలు, కుంకుమార్చనలు, మహాపూర్తహుతి వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామానికి చెందిన భక్తులు, విద్యుత్ అధికారులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని భక్తులు, విద్యుత్ అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Comments