15వ బెటాలియన్ లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి

15వ బెటాలియన్ లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి

సత్తుపల్లి, సెప్టెంబర్ 26 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి మండలం, బి గంగారం గ్రామంలో 15వ ప్రత్యేక పోలీసు పటాలములో శుక్రవారం నాడు చిట్యాల ఐలమ్మ 130వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి పటాలపు కమాండెంట్ ఎన్ పెదబాబు హాజరై చిట్యాల ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కమాండెంట్ ఎన్ పెదబాబు మాట్లాడుతూ, తెలంగాణ అంటేనే ఒక తెగువ పోరాటం అని అన్నారు. 1949 సంవత్సరంలో జరిగిన ప్రజా ఉద్యమం భారతదేశ చరిత్రలో ఒక కీలక ఘట్టమని చెప్పారు. ఆ సాయుధ పోరాటం ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని గుర్తుచేశారు. సాధారణ రైతు కుటుంబానికి చెందిన చాకలి ఐలమ్మ పోరాటం చూపించిన ధైర్యం సాయుధ పోరాటానికి స్పూర్తి నిచ్చిందని అన్నారు. అటువంటి మహనీయురాలి జయంతిని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించడం గర్వకారణమని పేర్కొన్నారు. ఐలమ్మ ఆశయ సాధనకు అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ వేడుకలకు అదనపు కమాండెంట్ ఏ అంజయ్య సహాయ దళాధిపతులు ఎస్ శ్రీధరరాజా, ఎస్ డి రంగారెడ్డి, ఆర్ ఐలు, ఆర్ ఎస్ ఐలు, పటాలపు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొని విజయవంతం చేశారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .