ప్రతి గడపలో బిజెపి నినాదం ప్రతిధ్వనించాలి.

ఎన్నిక ఏదైనా విజయమే మన లక్ష్యం.

ప్రతి గడపలో బిజెపి నినాదం ప్రతిధ్వనించాలి.

* కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల ముందుంచాలి.
* బిజేపి జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు.

ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 7, తెలంగాణ ముచ్చట్లు;

“భారతీయ జనతా పార్టీ నినాదం ప్రతి గడపలో ప్రతిధ్వనించాలి... ప్రజల మనసుల్లో విశ్వాసాన్ని నింపాలి” అని బిజెపి జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా కార్యాలయంలో నూతనంగా నియమితమైన జిల్లా కార్యవర్గ సభ్యులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ పార్టీ పటిష్ఠత, ప్రజల మద్దతు, క్రమశిక్షణపై విస్తృతంగా చర్చించారు.

జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ, బిజెపి ఇక కోటల్లో లేదా కార్యాలయాల్లో కాదు, గడపగడపలో ఉండాలని చెప్పారు. “బిజెపి ఎక్కడుంది అని ప్రశ్నించే వారికి ఇప్పుడు సమాధానం ఒక్కటే – ప్రతి గడపలో బిజెపి ఉంది. ప్రతి ఇంటిలో మోడీ ఆలోచనలే మారుమ్రోగాలి” అని ఆయన ఉత్సాహంగా వ్యాఖ్యానించారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి నాయకుడు, కార్యకర్త క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేయాలని సూచించారు. రోజుకు కనీసం 14 గంటలు పార్టీ కోసం కేటాయించాలి, గ్రామస్థాయి నుండి పట్టణాల వరకు ప్రతి ఓటరుతో సంబంధం పెంచుకోవాలి అని చెప్పారు.
ప్రధానంగా  కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను బలంగా ప్రస్తావించారు. “ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. హామీలు ఇచ్చి ఆచరణలో విఫలమైంది. కానీ బిజెపి ఇచ్చిన మాట వృథా కాదు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతోంది. ప్రజలకు ఈ సత్యం తెలియజేయడం ప్రతి బిజెపి కార్యకర్త బాధ్యత” అని ఆయన అన్నారు.

“ఎన్నిక ఏదైనా – అది గ్రామపంచాయతి అయినా, మున్సిపల్ ఎన్నిక అయినా లేదా పార్లమెంట్ అయినా – విజయం మాత్రం మనదే కావాలి. ఓటు శాతం కంటే విశ్వాస శాతం పెరగాలి. ప్రజల మనసుల్లో బిజెపి విశ్వాసాన్ని నింపాలి. క్రమశిక్షణ, కృషి, కృతనిశ్చయం – ఇవే మన పార్టీ బలం. మనం పాదాలమీద నిలబడి పనిచేస్తే ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించగలుగుతాం” అని ఆయన స్పష్టం చేశారు.

జిల్లా కమిటీ నాయకులు తమ పరిధిలోని శక్తికేంద్రాలను క్రమం తప్పకుండా పరిశీలించి వాటిని బలోపేతం చేయాలని సూచించారు. “ప్రజలకు ఉన్న సమస్యలను క్రమం తప్పకుండా గుర్తించండి, వాటి పరిష్కారం కోసం అధికారులతో చర్చించండి. సమస్య పరిష్కారమే మన పార్టీ పట్ల ప్రజల్లో నమ్మకం పెంచే మార్గం” అని చెప్పారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి స్థానంలో బిజెపి పోటీ ఖాయం అని వెల్లడించారు. “ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలనుకుంటున్నారో వివరాలను వెంటనే పంపించండి. అర్హులైన వారికి తగిన అవకాశాలు ఇవ్వబడతాయి. ప్రతి స్థానంలో గెలవడం లక్ష్యంగా ముందుకెళ్లాలి” అని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా నెల్లూరి కోటేశ్వరరావు నూతన కమిటీ సభ్యులందరినీ అభినందించి సన్మానించారు. నూతనంగా నియమితమైన కార్యవర్గ సభ్యులు పార్టీ పట్ల తమ కృతజ్ఞతలు తెలియజేసి, జిల్లా అధ్యక్షుడి మార్గదర్శకత్వంలో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో సీనియర్ నాయకులు మందడపు సుబ్బారావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు గుత్తా వెంకటేశ్వరరావు, నాయుడు రాఘవరావు, నలగట్టు ప్రవీణ్‌కుమార్, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .