మీనాక్షి నగర్‌లో అభివృద్ధి పనులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే 

బండారి లక్ష్మారెడ్డి

మీనాక్షి నగర్‌లో అభివృద్ధి పనులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే 

చర్లపల్లి, అక్టోబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గం చర్లపల్లి డివిజన్ పరిధిలోని మీనాక్షి నగర్‌లో జరుగుతున్న రోడ్డు అభివృద్ధి పనులను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. ఆయన కాలనీ ప్రాంతంలో తిరిగి ప్రజలతో మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు.రోడ్ పనులు నాణ్యతను పరిశీలించి, పనులను వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. కాలనీ వాసులు డ్రైనేజీ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగానే, వెంటనే అధికారులను ఆదేశించి అవసరమైన పనులు ప్రారంభించమని సూచించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ — “మీనాక్షి నగర్‌లో తక్షణ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. ప్రజల అభ్యర్థనల మేరకు ప్రతి సమస్యను ఒకదాని తర్వాత ఒకటి పరిష్కరిస్తాం,” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు సురేష్ గుప్త, ప్రధాన కార్యదర్శి నర్సింగ్ రావు, కాలనీ వాసులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

వందేమాతరం గీతం – దేశభక్తికి ప్రతీక వందేమాతరం గీతం – దేశభక్తికి ప్రతీక
-మన స్వాతంత్ర్య సమరయోధులలో  ఆత్మవిశ్వాసాన్ని రగిలించిన గీతం  -ఎస్సై ఏ. ప్రవీణ్ కుమార్  ఎల్కతుర్తి. నవంబర్ 07(తెలంగాణ ముచ్చట్లు): స్వాతంత్ర్య సమరయోధులలో ఆత్మవిశ్వాసం, త్యాగస్ఫూర్తిని రగిలించిన వందేమాతరం...
సెయింట్ థామస్ అల్టిట్యూడ్ హైస్కూల్లో ఘనంగా “వందేమాతరం 150 ఏళ్ల” సంబరాలు
నిరూపయోగంగా పబ్లిక్ టాయిలెట్లు 
జూబ్లీహిల్స్ లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే -నగరాభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం
ఈసీఐఎల్ మెగా జూనియర్ కాలేజీలో సామూహిక వందేమాతరం గానం
రాచకొండ కమిషనరేట్‌లో వందేమాతర గీతం 150 ఏళ్ల వేడుకలు
కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో సామూహిక వందే మాతరం గానం