ఇందిరమ్మ ఇండ్ల సర్వే పారదర్శకంగా చేపట్టాలి 

 వనపర్తి జిల్లా అడిషనల్ కలెక్టర్ సంచిత్  గంగ్వార్

ఇందిరమ్మ ఇండ్ల సర్వే పారదర్శకంగా చేపట్టాలి 

వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు: 

ఇందిరమ్మ ఇండ్ల సర్వే పారదర్శకంగా నిర్వహించాలని వనపర్తి జిల్లా అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీ) సంచిత్ గంగ్వార్ అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలోని న్యూ ఎస్సీ కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పరిశీలించారు. వెల్టూర్ హరిజనవాడలో జరుగుతున్న సర్వేను క్షేత్రస్థాయిలో జిల్లా అడిషనల్ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ కలెక్టర్  మాట్లాడుతూ.. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వివరాలు నమోదు చేయాలని అన్నారు. ఇంటి స్థలం ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ సర్వేలో వివరాలు నమోదు చేసుకునే విధంగా ప్రజలను చైతన్య పరచాలని సూచించారు. అంతకుముందు వెల్టూర్ లోని మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల వసతి గృహంలో విద్యార్థినిలతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. అనంతరం హరిజన్ వాడ లోని అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించారు.  ఈ కార్యక్రమంలో పెద్దమందడి తహసిల్దార్, పంచాయతీ కార్యదర్శి వెంకటస్వామి, సర్వే సిబ్బంది, అధికారులు, గ్రామస్తులు దయ్యాల శేఖర్, నరాల ఆంజనేయులు, గుండెల ఆంజనేయులు, నరాల మోహన్, ఏర్పుల రాములు తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2024-12-17 at 9.10.03 PM (1)

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .