భారీ వర్షాలకు సర్వం కోల్పోయిన వారు ధైర్యంగా ఉండాలి

-జమాఅతె ఇస్లామి హింద్

భారీ వర్షాలకు సర్వం కోల్పోయిన వారు ధైర్యంగా ఉండాలి

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

జమాఅతె ఇస్లామి హింద్ ఖమ్మం శాఖ ఆధ్వర్యంలో ఇటీవల భారీ వర్షాలకు సర్వం కోల్పోయిన రామన్నపేట కాలనీ మరియు వెంకటేశ్వర కాలనీ వరద బాధితుల ఇండ్ల దగ్గరికి వెళ్లి వంట చేయటానికి కావలిసిన వంట పాత్రలు , కడాయి, ప్లేట్ లు, గ్లాస్ లు, స్టీల్ గిన్నెలు, గంటలు తదితర సామాన్లతో కూడిన కిట్టుగా తయారుచేసి వరద ముంపు బాధిత కుటుంబాలకు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జమాఅతె ఇస్లామి హింద్ జిల్లా అధ్యక్షులు జైనుల్ పాషా మాట్లాడుతూ ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరమని మనం ఎంత సహాయం చేసినా తక్కువే అని అన్నారు . సామాజిక సేవకు ప్రాధాన్యత ఇచ్చే సంస్థ జమాఅతె ఇస్లామి హింద్ అందుకే ఆపదలో ఉన్న వారికి చేయూత అందించేందుకు తమ సంస్థ ఎప్పుడు ముందుంటుందని అన్నారు. ఈ కార్యాక్రమములో ఖిల్లా అధ్యక్షులు అబ్దుల్ మలిక్, , ఇంద్ర నగర్ అధ్యక్షులు అబ్రార్ అలీ, ఉపాధ్యక్షులు యసుఫ్ షరీఫ్, మొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .