ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి.
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి.
మెదక్ బ్యూరో తెలంగాణ ముచ్చట్లు:
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రోడ్డు ప్రమాదాల నివారించుటకు నేషనల్ హైవే మరియు ఆర్ అండ్ బి అధికారులతో శనివారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు కారణాలను అడిగి తెలుసుకున్నారు.
జాతీయ రహదారిపైన జరిగిన ప్రమాదలు ఓవర్ లోడ్ డ్రైవర్ డ్రింక్ చేసి ఉన్నందున ప్రమాదం జరుగుతాయని, అలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు కాషన్ బోర్డర్స్ ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి జాతీయ రహదారి అధికారులకు సూచించారు. రోడ్డు పక్కల నో షాపింగ్..నో పార్కింగ్ బోర్డులను ఏర్పాటు తో పాటు ప్రమాద సూచికల హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Comments