జి యస్ టీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉల్లిబోయిన సైదులు

ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు: ఖమ్మం జిల్లా జి యస్ టీ ప్రొఫెసనల్స్ అసోసియేషన్ 2025 & 2026 నూతన ప్రెసిడెంట్ గా చింతకాని మండలం, నామవరం గ్రామానికి చెందిన ఉల్లిబోయిన సైదులు ఏకగ్రీవంగా ఎన్నుక కాబడిన పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమం సంఘం గౌరవ అధ్యక్షులు బూరుగుల దుర్గాప్రసాద్ రావు అధ్యక్షతన ఖమ్మం లో సి వి ఆర్ బ్యాంకట్ హాల్ నందు నిర్వాయించారు. ముఖ్య అతిధిగా జాయింట్ కమీషనర్(రాష్ట్ర పన్నులు) శ్రీ రావుల శశిదరా చారి, మరియు గౌరవ అతిధిగా తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ ఏ ఐ ఎఫ్ టీ పి (యస్ జెడ్) నగేష్ రంగి, ఖమ్మం అసోసియేషన్ ప్రస్తుత ప్రెసిడెంట్ రామకృష్ణ , ముఖ్య సలహాదారు కోటేశ్వరరావు మరియు తెలంగాణ రాష్ట్ర సంఘం సభ్యులు పాల్గొన్నారు.
జనరల్ సెక్రటరీ గా కొమ్మరాజు పవన్ కుమార్, కోశాధికారి గా గుద్దేటి రమేష్, వైస్ ప్రెసిడెంట్ గా ఉటుకూరు శ్రీనివాసులు, జాయింట్ సెక్రటరీ గా చిలుకూరు శ్రీధర్ రెడ్డి, కార్యనిర్వాహక కమిటీ సభ్యులుగా వాసు, రామకృష్ణ, ఉపేందర్, సాయి సుధామోహన్, ఈశ్వరయ్య, ఖాజా, సురేష్ కుమార్ పదవి ప్రమాణ స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రస్తుత ప్రెసిడెంట్ కప్పగంతుల రామకృష్ణ శుభాకాంక్షలు తెలిపి భాద్యతలను అప్పగించారు కార్యక్రమంలో సంగ కార్య నిర్వాహక మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు నూతన కమిటీ కి శుభాకాంక్షలు తెలిపారు.


Comments