కుషాయిగూడ డిపో మేనేజర్‌గా వేణుగోపాల్ బాధ్యతలు స్వీకరణ

కుషాయిగూడ డిపో మేనేజర్‌గా వేణుగోపాల్ బాధ్యతలు స్వీకరణ

కుషాయిగూడ, సెప్టెంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):

కుషాయిగూడ ఆర్టీసీ డిపోకు కొత్త మేనేజర్‌గా వి. వేణుగోపాల్ బుధవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. గత కొంతకాలంగా ఈ డిపో మేనేజర్‌గా సేవలందించిన మహేష్ కుమార్ హెడ్ ఆఫీస్‌కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో వేణుగోపాల్ నియమితులవడం తో డిపో సిబ్బందిలో కొత్త ఉత్సాహం నెలకొంది.ఈ సందర్భంగా నూతన మేనేజర్ వేణుగోపాల్ మాట్లాడుతూ,డ్రైవర్లు, కండక్టర్లు సమయపాలనకు ప్రాధాన్యం ఇవ్వాలని,ప్రయాణికుల సమస్యలు లేకుండా సకాలంలో బస్సులు నడపాలని,ప్రజల నమ్మకాన్ని మరింత పెంపొందించేందుకు అందరూ కృషి చేయాలని సూచించారు.డిపో అభివృద్ధి, ఆదాయ వృద్ధి, ప్రయాణికుల కు ఆధునిక సౌకర్యాలు కల్పించడం తన ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ రవాణా సంస్థపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడంలో సిబ్బందంతా సహకరించాలని వేణుగోపాల్ పిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలో డిపో సిబ్బంది, యూనియన్ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని కొత్త మేనేజర్‌ను అభినందించారు. కొత్త మేనేజర్ బాధ్యతలు స్వీకరించడంతో రాబోయే రోజుల్లో కుషాయిగూడ డిపో సేవలు మరింత సమర్థవంతంగా కొనసాగుతాయని సిబ్బంది ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .