ఎగుమతయ్యే ఉత్పత్తులను మరింత పెంచేందుకు అన్ని వసతులు కల్పిస్తాం

జిల్లా కలెక్టర్ ప్రావీణ్య 

ఎగుమతయ్యే ఉత్పత్తులను మరింత పెంచేందుకు అన్ని వసతులు కల్పిస్తాం

హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు: 

జిల్లా నుంచి ఎగుమతి అయ్యే ఉత్పత్తులను మరింత పెంచేందుకు అన్ని రకాల వసతులు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు.

సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎగుమతుల పరిమాణాలను అసోసియేషన్ ద్వారా సేకరించి నివేదిక రూపంలో అందించాలని, ముఖ్యంగా బియ్యం, గ్రానైట్, మిరపకాయలు, టెక్స్టైల్ ఉత్పత్తుల ఎగుమతులపై దృష్టి పెట్టాలని సూచించారు.

రైతులు నాణ్యమైన ఉత్పత్తులు అందించి అంతర్జాతీయ మార్కెట్లో పోటీతత్వాన్ని పెంచేందుకు అవగాహన కల్పించాలని, అలాగే ఎగుమతి దారుల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు నివేదికలను సమర్పించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ నవీన్ కుమార్, డీజీఎఫ్‌టీ ఉపసంచాలకులు శైలజ (వర్చువల్‌గా), ఎల్‌డీఎం శ్రీనివాస్, చాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, గ్రానైట్ అసోసియేషన్ అధ్యక్షుడు చక్రధర్ రెడ్డి, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.WhatsApp Image 2024-12-30 at 6.43.24 PM (1)

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .