కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
కమిషనర్ ఎన్. వెంకట్ రెడ్డి
దమ్మాయిగూడ, అక్టోబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని చీర్యాల డబుల్ బెడ్రూం కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకట్ రెడ్డి అన్నారు.బుధవారం కమిషనర్ కాలనీని సందర్శించి స్థానిక ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు రోడ్లు దెబ్బతినడం, డ్రైనేజీ లీకేజీలు, వీధి దీపాల లోపాలు, చెత్త సేకరణలోఆలస్యం వంటి పలు సమస్యలను వివరించారు. వాటిని శ్రద్ధగా విన్న కమిషనర్ వెంటనే అధికారులను ఆదేశించి చర్యలు తీసుకోవాలని సూచించారు. 
“కాలనీలో ఎలాంటి సమస్యలైనా మున్సిపాలిటీ దృష్టికి తీసుకురావాలి. ప్రజల సహకారంతో దమ్మాయిగూడను పరిశుభ్రంగా, అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తాం” అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో కీసర మండల బీజేపీ అధ్యక్షుడు కోళ్ల బాలరాజ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోళ్ల కృష్ణ యాదవ్, సానిటరీ ఇన్స్పెక్టర్ రాం రెడ్డి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.


Comments